Thursday, April 25, 2024

Breaking: తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. 3ఎఫ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో కొంత మంది కార్మికులు మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాప‌క సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement