Wednesday, April 24, 2024

మాగంటి బాబు కుటుంబా నికి చంద్రబాబు పరామర్శ

ఏలూరులో మాగంటి బాబు కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో ఏలూరు వెళ్లిన ఆయన.. ఇటీవల మరణించిన మాగంటి బాబు కుమారుడు రాంజీ సంస్మరణ సభలో పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు రాంజీ మరణం బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలకు మాగంటి కుటుంబం ఎన్నో సేవలందించిందని.. వారికి అందరూ అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement