Friday, April 19, 2024

ట్రాక్టర్ – లారీ ఢీః ముగ్గురు మృతి

జంగారెడ్డిగూడెం బైపాస్ లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జ‌రిగింది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని లారీ ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ట్రాక్టర్ లో ఉన్న ముగ్గురు మృతి చెందారు.  20 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. . బాధితులు కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వారు. క్షతగాత్రులను108 వాహనాలలో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement