Saturday, April 20, 2024

త్వ‌ర‌లోనే పాపికొండ‌లు బోటింగ్ ప్రారంభిస్తాం: మంత్రి రోజా

పాపికొండలు బోటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంత్రి రోజా తెలిపారు. మంగళవారం బోధిసిరి బోట్‌ను పున:ప్రారంభించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా పర్యాటక శాఖ అదాయం తగ్గిందని తెలిపారు. బోటు ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్ ల‌ ద్వారా బోట్ ల‌ను మానిటర్ చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement