Thursday, April 25, 2024

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాం : మంత్రి బొత్స‌

తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమైంది. సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద వైఎస్ విగ్రహానికి మంత్రులు నివాళులర్పించిన ఈ బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. సమాజంలో విప్లవాత్మక మార్పులను తెస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement