Saturday, April 20, 2024

మూడేళ్ల‌లోనే రాజధానిగా అమ‌రావ‌తి నిర్మిస్తాం : సోము వీర్రాజు

రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవని, అలాగే మూడేళ్లలోనే రాజధాని అమరావతిని నిర్మిస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ…. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్ల ప్రజలను మోసం చేయగా.. మూడు రాజధానుల పేరుతో జగన్ మూడేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్న సోము వీర్రాజు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిధులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీకి ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తుండటం సిగ్గు చేటన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో చర్చిలు, మసీదులకు నిధులు కేటాయిస్తూ.. పాస్టర్, మౌజమ్‌లకు జీతాలు ఇవ్వడం మతతత్వాన్ని ప్రోత్సహించడం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మూడేళ్లలో అమరావతిని రాజధానిగా నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement