Monday, March 25, 2024

టీడీపీ కంటే తక్కువ అప్పులే చేశాం.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే తక్కువ అప్పులే చేశామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేయలేదన్నారు. ద్రవ్యలోటు ఏపీది ఎక్కువ ఏం కాదన్నారు. పరిమితికి మించి ఏపీ ఎక్కువ అప్పులు చేయలేదన్నారు. కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రతి రాష్ట్రం అప్పులు చేసిందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీ చేసిన అప్పులు తక్కువేనన్నారు. ఎంతో నిబద్దతతో తాము పాలన కొనసాగిస్తున్నామన్నారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ బాధ్యత లేకుండా వ్యవహరించిందన్నారు. 2019 తర్వాత చేసిన అప్పులు టీడీపీ చేసిన అప్పుల కంటే చాలా తక్కువ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement