Friday, March 29, 2024

మూడు రాజధానులకు ఒక్కో అడ్డంకి తొలగిస్తున్నాం.. మంత్రి కాకాణి

మూడు రాజధానులకు ఏపీ ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగిస్తోందని ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి వెల్లడించారు. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. అమరావతి విషయంలో కొన్ని అంశాలపై ధర్మాసనం స్టే ఇచ్చిందన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీలను రైతులుగా సృష్టించారని తెలిపారు. అడ్డగోలుగా కొట్టేసిన భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నార‌న్నారు. రానున్న రోజుల్లో అన్ని అడ్డంకులు తొలగిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement