Thursday, March 28, 2024

మూడు రాజధానులకే మేం కట్టుబడి ఉన్నాం.. సజ్జల

మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కోసం తాము రాజకీయం చేయబోమని అన్నారు. బుగ్గన ఏ సందర్భంలో అన్నారో తనకు తెలియదన్నారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. అన్ని ప్రాంతాల డెవలప్ మెంటే తమ విధానమన్నారు. పరిపాలనను వికేంద్రీకరించాలనేదే తమ అభిప్రాయమన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అదే చెప్పారన్నారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందన్నారు. హైకోర్టు కర్నూలులో వస్తుందన్నారు. కొందరు కావాలనే అయోమయం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement