Friday, April 19, 2024

కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర  ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు  ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు  జీవో జారీ చేశారు. విజయవాడలో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది. వక్ఫ్ చట్టం-1955లోని సెక్షన్ 83 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. దీంతో హైదరాబాద్ లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ నే ఏపీ కేసుల విచారణకు వినియోగించుకుంటన్నారు. దీని వల్ల విచారణలో జాప్యం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement