Friday, April 19, 2024

ఆత్మప్రబోధానుసారమే ఓటు వేశా… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తన ఆత్మప్రబోధానుసారమే ఓటు వేసినట్లు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అదే సమయంలో పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. దీనికి కారణం వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న క్రాస్ ఓటింగే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలు వైసీపీ, టీడీపీని వేధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు వైసీపీకే వేశారా లేక టీడీపీకి వేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. తన ఆత్మప్రబోధానుసారమే ఓటు వేసినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఆత్మసాక్షిగానే ఓటు వేసినట్లు ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement