Thursday, April 25, 2024

మంత్రి బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

ఏపీలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఓ ఐఏఎస్ అధికారి.. మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి ఆశీస్సులు పొందడం వివాదానికి తీసింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ కిశోర్ కుమార్.. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. ఈ క్రమంలో మంత్రికి బొకే ఇచ్చి.. న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పి.. ఆయనకు వంగి కాళ్లకు నమస్కరించారు. జేసీ తీరు చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణలోనూ గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గతేడాది జూన్ లో సిద్ధిపేట జిల్లా కేంద్రాల్లో నూతన కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. దీంతో ఆయన తీరుపై అప్పట్లో సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. కాగా, కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి.. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement