Saturday, April 20, 2024

14 నుంచి విశాఖ శారదాపీఠాధిపతులు తిరుమల పర్యటన..

విశాఖపట్నం, ప్రభన్యూస్ : హిందూ సనాతన ధర్మంపై విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వామి స్వరూపనందేంద్ర సరస్వతీ,ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వామిలు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు తిరుమల పర్యటన చేయనున్నట్లు పీఠం వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగానే 14వ తేదిన 9 గంటలకు శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుని ఆలయం,11 గంటలకు తిరుపతిలో గంగమ్మ తల్లి ఆలయం,12 గంటలకు పీఠం తిరుమల ఆశ్రమం,4.30 గంటలకు భక్తుల సందర్శన సమయం, 15వ తేదిన ఉదయం 9 గంటలకు తిరుచానురు అమ్మవారి ఆలయం,10.30 గంటలకు ధర్మప్రచార పరిషత్‌ అధికారులతో భేటీ, 11 గంటలకు స్వధర్మ వాహిని లోగో ఆవిష్కరణ, 6.30 గంటలకు నారయణగిరి ఉద్యానవనంలో తరిగొండ వెంగమాంబ జయంత్యుత్యవములు, 16వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం, 12.30 గంటలకు విశాఖకు తిరుగుపయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. లోకకళ్యాణార్థం ఆలయాలను సందర్శించనున్నట్లు పీఠం వర్గాలు తెలిపాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement