Saturday, April 20, 2024

త్వ‌ర‌లోనే పరిపాలన రాజధానిగా విశాఖ : మంత్రి బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు నెలల్లోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందన్నారు. సీఎం జగన్ కూడా విశాఖలోనే ఉంటారని స్పష్టం చేశారు. అనంతరం భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఫిబ్రవరిలోగా శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గతేడాది కంటే కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి జరగాలని వెల్లడించారు. విశాఖను ఏపీ పరిపాలన రాజధాని చేయడం వైసీపీ ప్రభుత్వ విధానమని తెలిపారు. సీఎం జగన్ కూడా విశాఖలో ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement