Friday, March 29, 2024

విశాఖ‌ప‌ట్నం ఏపీ కాపిట‌ల్.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌

త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం ఏపీ కాపిట‌ల్ కాబోతుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం జ‌గ‌న్. ఈ మేర‌కు తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని వివరించారు. నేడు ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను విశాఖకు ఆహ్వానిస్తున్నామని… ఏపీ 12% వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. ఇక్కడ సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సీఎం జగన్‌ వివరించారు. “రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement