Saturday, April 20, 2024

2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement