Saturday, April 20, 2024

దసపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేశాం.. విజయసాయిరెడ్డి

దసపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. అది ప్రభుత్వ భూమి కాదన్నారు. ప్రైవేట్ భూమిని 22ఏ నుంచి తీసేస్తే తప్పేముందన్నారు. ఇందులోనూ బెనిఫిట్ పొందింది చంద్రబాబు సామాజిక వర్గం వారేనన్నారు.

విశాఖలో జనం ఎక్కువగా వేరే సామాజికవర్గం వారు ఉంటే.. ఆస్తులన్నీ చంద్రబాబు సామాజిక వర్గం వారికే ఉన్నాయన్నారు. తనకు విశాఖ సీతమ్మ ధారలో మాత్రమే ఒక్క ప్లాట్ ఉందన్నారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో తన పాత్ర ఎక్కడా లేదన్నారు. తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమని, మీరు సిద్ధమా అన్నారు. తాను ఇంత వరకు ఏ వ్యాపారం చేయలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement