Wednesday, April 24, 2024

ప‌ట్టాలు త‌ప్పిన విశాఖ-కిరండోల్‌ ప్యాసింజర్‌ ట్రైన్‌..

విశాఖ-కిరండోల్‌ ప్యాసింజర్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది.. అయితే, డ్రైవర్‌ అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది.. ఈ ఘ‌ట‌న ఇవాళ ఉదయం విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం దగ్గర చోటుచేసుంది. విశాఖ – కిరండోల్ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది ఓ బోగీ.. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement