Tuesday, March 26, 2024

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి

విశాఖపట్నం – విశాఖలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బుధవారం కంచరపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్‌లో భాగంగా చెన్నై నుంచి రైలు విశాఖ వస్తుండగా రాళ్ల దాడి జరిగింది. వందే భారత్ ట్రైన్‌పై రాళ్ల దాడిని వాల్తేర్ డివిజన్ అధికారులు ధ్రువీకరించారు. దీంతో దుండగులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. కాగా.. ఈ నెల 19న హైదరాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement