Thursday, April 25, 2024

వైజాగ్ లో కుప్ప‌కూలిన రెండంస్తుల భ‌వనం… ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో విషాదం నెలకొంది. రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పూర్ణా మార్కెట్ కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ శబ్దంతో భవనం కూలడంతో సమీప స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాద సమయంలో భవనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement