Tuesday, April 16, 2024

విశాఖ జిల్లాలో దారుణం.. మూడేళ్ల చిన్నారిని హతమార్చిన కన్నతల్లి

మధురవాడ మారికవలసలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురుని విస్మయానికి గురి చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని మూడు ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మారికవలస గ్రామంలో వరలక్ష్మీ అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీష్‌రెడ్డి అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ.. తన వివాహేతర బంధం కారణంగా తన మూడేళ్ల చిన్నారిని బలితీసుకుంది.

కాగా సంఘటనా స్థలానికి వరలక్ష్మీని తీసుకొచ్చినప్పుడు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాటతో పాటు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement