Wednesday, March 27, 2024

లారీ లోయ‌లో ప‌డి.. ఇద్ద‌రు మృతి

లారీ లోయ‌లో ప‌డి ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో జరిగింది. ప్రమాదవశాత్తు ఓ లారీ లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లి – చింతూరు మధ్య ఉన్న పాలమూరు గొంది టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement