Thursday, April 25, 2024

Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ బైకు ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. మరో రెండు రోజుల్లో విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండటంతో బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement