Thursday, April 25, 2024

సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సన్నాహాలు..

విశాఖపట్నం – సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం ఈనెల 14వ తేదీన జరగబోతోంది. ఇందుకోసం చందనం చెక్కలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి నిజరూప దర్శనమైన తర్వాత సహస్ర ఘట్టాభిషేకం అనంతరం చందన సమర్పణ నిమిత్తం స్వామివారం భండారం నుంచి చందనం కర్రలు తీసుకుని … చందనం తీయడానికి అనుకూలంగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తయారుచేయడమైనది. అరగదీతకు అనుకూలంగా శుభ్రపరిచారు. చందనం సాన ముహూర్తి 7వ తేదీ… అప్పటి నుంచి చందనం తీయడం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement