Thursday, April 25, 2024

సింహాచలం: ఇకపై దర్శనాలు 2 గంటలే

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని… శుక్రవారం నుంచి రోజూ ఉదయం 7:30 నుంచి 9:30 మధ్య భక్తులు దర్శించుకోవచ్చు. రెవెన్యూ – దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలమేరకు … ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు గరిష్టంగా రెండు గంటలకన్నా ఎక్కువ సమయం భక్తులకు – ఆలయంలోకి అనుమతించొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. భక్తుల సౌకర్యార్థం ఉదయం 7:30 నుంచి 9:30 వరకు అనుమతించబడును. కోవిడ్ ప్రొటోకాల్ ను పూర్తి స్థాయిలో పాటిస్తూ… ఈ రెండు గంటల సమయంలోనే శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని ఆలయ ఈఓ , అధికారులు విజ్ఞప్తి చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు… ఈ రెండు గంటల నియమం అమల్లోఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement