Sunday, April 14, 2024

19 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్‌..

అనకాపల్లి : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం అనకాపల్లిలోని ఏటిగైరంపేట దగ్గర ప్రైవేట్‌ బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దుండగుల వద్ద 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేసి బస్సును సీజ్‌ చేశారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఇందులో పాత్రదారులు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement