Thursday, April 25, 2024

రూ. 80లక్షల విలువైన గంజాయి పట్టివేత

చోడవరం :  మూడు వేల కిలోల గంజాయిని విశాఖ జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో  స‌రిహ‌ద్దు ఉన్న‌ మ‌ల్క‌న్‌గిరి, కోరాపుట్ నుంచి గంజాయి వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు.  మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 ల‌క్ష‌లు ఉంటుంది.  రూర‌ల్ ఎస్పీ బీ కృష్ణారావు మాట్లాడుతూ  ఈ కేసులో ఓ వ్య‌క్తిని, ట్ర‌క్కు డ్రైవ‌ర్‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.  కొరియ‌ర్‌గా డ్రైవ‌ర్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఎస్పీ వెల్ల‌డించారు.  కొరియ‌ర్ అరెస్టు కావ‌డంతో ఆ గంజాయి కోసం తునిలో ఎదురుచూస్తున్న వ్య‌క్తి ప‌రారీ అయిన‌ట్లు తెలిపారు.  గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉండే ఏజెన్సీలో గంజాయిని అధిక శాతం పండిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం నుంచే ఎక్కువ శాతం గంజాయి బెంగుళూరుకు స్మ‌గ్లింగ్ అవుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement