Friday, April 26, 2024

నూతన ట్రాక్ నిర్మాణ పనులు.. పలు రైళ్లు రద్దు..

నూతన ట్రాక్‌ నిర్మాణ పనుల వల్ల అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ గుండా వెళ్లే రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పాక్షికంగా రద్దు చేసింది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ నంబర్లు(12717, 12718), గుంటూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లే గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239, 17240) రైళ్లను ఆగస్టు 2వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటివరకు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ-తుని మధ్య, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు-సామర్లకోట మధ్య రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే కాకినాడ రైలును వచ్చే నెల రెండో తేదీ వరకు పూర్తిగా రద్దు చేసినట్టు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement