Saturday, April 20, 2024

లోకేష్ … పొలిటిక‌ల్ క‌మేడియ‌న్ః ల‌క్ష్మీ పార్వ‌తి

విశాఖపట్నం,ప్రభన్యూస్‌: టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ పాద యాత్రపై రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆమె పార్టీ కార్యాలయంలో మీడి యాతో మాట్లాడుతూ లోకేష్‌ ఏనాడూ, ఏ ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. ఆయనను ఎలాగైనా సీఎం ను చేయాలని చెప్పి, చంద్రబాబు జనంలోకి పంపిస్తున్నారు. లోకేష్‌ ఒక రాజకీయ కమెడియన్‌. ఆయన పాదయాత్ర కూడా కామెడీ మాదిరిగానే ఉంటు-ందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల తీరు ప్రభుత్వం నిజం చెబితే తప్పుగా ఉందని, అదే టీడీపీ తప్పు చేసినా ఒప్పు అన్నట్లు ప్రతిపక్షాల తీరు ఉం దన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవో నెంబర్‌1ను తీసుకువస్తే స్టేలతో అడ్డుపడుతున్నారని, ఎక్కడా వైసీపీ న్యాయస్ధానాలను విమర్శించలేదున్నారు. ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా? హంతకులు ఇద్దరు సాక్షం చెప్పుకున్నట్లు బాలకృష్ణ,చంద్రబాబు మాటలు ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement