Thursday, March 28, 2024

ఘోర‌ రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

విశాఖపట్టణంలోని అగనంపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై లారీ టైర్ మార్చుతుండగా వేగంగా వచ్చి బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement