Thursday, April 18, 2024

ప్రత్యేక హోదాపై.. మోడీకి విన్నవించిన సీఎం జగన్…

విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీకి విన్నవించారు. ఈ సందర్భంగా సభా వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి మీతో మాకున్న బంధం రాజకీయాలకు … పార్టీలకు అతీతమైందని తెలిపారు. ఇక ఇదే సందర్భంలో విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

8 సంవత్సరాల క్రితం విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద గాయం అయిందని స్పష్టం చేశారు. ఇంకా ఆ గాయం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలు, సహృదీయులు అయిన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సాయం, ప్రతి సంస్థ ఇచ్చే ప్రతి రూపాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం… అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement