Friday, March 29, 2024

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు ఏర్పా ట్లు- ముమ్మరంగా సాగుతున్నాయి. పీఠం ప్రాం గణంలో జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు- ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం వార్షిక మహోత్స వాలకు అంకురార్పణ జరుగుతుంది. వార్షికోత్స వాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతీ స్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు- చేపట్టారు. వందలాది మంది శాస్త్ర, ఆగమ, వేద పండితులు వీటిలో పాల్గొంటారు. సచ్చిదానంద విద్వత్‌ సభ పేరుతో నిర్వహించే శ్రౌత, శాస్త్ర, మహాసభల్లో ఉత్తమ పాండిత్యం ప్రదర్శించిన పండితులకు స్వర్ణ కంకణ ధారణ చేస్తారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చతుర్వేద హవనం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు- శత సహస్ర రాజశ్యామలా యాగం లక్ష మూల మంత్రాలతో చేపడుతున్నారు. జగద్గు రు ఆది శంకరాచార్యుల వారి ప్రపంచ సార తంత్ర గ్రంధం ఆధారంగా మహా యాగం జరుగుతుంది. అలాగే సర్వజ నుల హితాన్ని కాంక్షిస్తూ విశేష హొ మాలు జరుగుతాయి. వీటిలో శ్రీలక్ష్మీ గణపతి హోమం, శ్రీ మేధా దక్షిణా మూర్తి హోమం, సుబ్రహ్మణ్య హో మం, మన్యుసూక్త హోమం, రుద్రహో మం ఉంటాయి. 28వ తేదీన రధసప్త మి సందర్భంగా అరుణ పారాయణ, సూర్య నమస్కారములు నిర్వహి స్తారు. సుబ్రహ్మ ణ్యశ్వర స్వామిని ఆరాధిస్తూ 30వ తేదీ సాయంత్రం రధోత్సవం, రాత్రి వల్లీ కళ్యాణం ఉంటాయి. రధోత్స వంలో పాల్గొనేం దుకు పెద్ద ఎత్తున ఆదివాసీలు పీఠా నికి తరలివస్తారు.

ఆగమ శాస్త్రంపై అధ్యయనం జరగాలన్న లక్ష్యంతో ఈ వార్షికోత్సవాలలో ఆగమ సదస్సులను కూడా నిర్వహిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానం దేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. 27 నుంచి మూడు రోజులపాటు- చాత్తాద వైష్ణవాగమ సదస్సు, 30, 31 తేదీల్లో శైవగమ సదస్సు నిర్వహిస్తున్నట్లు- వివరించారు. పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో నిత్యం విశేష అభిషే కాలు, రాజశ్యామలా అమ్మవారికి రాత్రి 7 గంటలకు మహా మంగళ హారతి ఉంటు-ందని అన్నారు.
ఆధ్యా త్మిక చైతన్యం వెల్లివి రిసేలా లబ్ద ప్రతిష్టులైన కళాకా రులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు- చేసామని తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా సమేత చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చన విశేషంగా ఉంటు-ందని తెలిపారు. యావత్‌ భారతావనిలోనే మరెక్కడా జరగని విధంగా శత సహస్ర రాజశ్యామలా యాగం చేపడతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్ర హానికి పాత్రులు కావాలని స్వాత్మానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు.

యాగానికి రాజకీయ, వ్యాపార ప్రముఖులు:-
విశాఖ శ్రీ శారదాపీఠం ఆధిష్టాన దైవం రాజశ్యామ లా అమ్మవారి శత సహస్ర యాగంలో పాల్గొనేందుకు అనేక మంది రాజకీయ, వ్యాపా ర ప్రముఖులు వార్షికోత్సవాలకు తరలి వస్తున్నారు. 28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి యాగంలో పాల్గొనాలని సంకల్పించారు. అలాగే అదే రోజు ఉదయం పంజాబ్‌ గవర్నరు బన్వర్‌లాల్‌ పురోహిత్‌, సాయంత్రం తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ హాజరవుతారు. 30వ తేదీన హర్యానా గవర్నరు బండారు దత్తాత్రే య, ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచం దన్‌, తెలంగాణ గవర్నరు తమిళిసై కూడా వార్షి కోత్సవాల్లో పాల్గొనేందుకు తరలిరానున్నట్లు పీఠం వర్గాలు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement