Thursday, April 25, 2024

జి.కొత్తపల్లిలో హైటెన్షన్.. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి!

ఏలూరు జిల్లా ద్వార‌కాతిరుమ‌ల మండ‌లం జి.కొత్తపల్లిలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. వైసీపీ నేత గంజి ప్ర‌సాద్ దారుణ హ‌త్య‌కు గురి అయ్యారు. దీంతో ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన గోపాల‌పురం వైసీపీ ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. అయితే, అతి క‌ష్టం మీద గ్రామ‌స్తుల బారి నుంచి ఎమ్మెల్యేను త‌ప్పించిన పోలీసులు..ఆయ‌న‌ను అక్క‌డికి స‌మీపంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల భ‌వ‌నంలో ఉంచారు. అయితే ఆ పాఠ‌శాల భ‌వనాన్ని చుట్టుముట్టిన గ్రామ‌స్తులు.. ఎమ్మెల్యేను వ‌దిలిపెట్టేది లేదంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. పాఠ‌శాల భ‌వ‌నం లోప‌ల ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావు, ఆ భ‌వ‌నం చుట్టూ వైసీపీ శ్రేణులు… వారి మ‌ధ్య పోలీసులు ఉన్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న జిల్లా ఎస్పీ.. అద‌న‌పు బ‌ల‌గాల‌ను గ్రామానికి తరలించారు. కాగా, గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే కారణమంటూ స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement