Monday, March 25, 2024

అనంతలో సచివాలయ ఉద్యోగులు నిరసన

అనంతపురంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో సచివాలయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. పుట్టపర్తి అర్బన్ లో సచివాలయ ఉద్యోగుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు.. విధులకు గైర్హాజరై.. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. దాదాపు 80 మంది నిరసన దీక్షలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement