Thursday, April 18, 2024

గోడ కూలి ఇద్ద‌రు మృతి

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయ నగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో ఓ పెంకుటిల్లు కూలి నానమ్మ, మనవడు మృతిచెందిన విషాద కర ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తు‌న్న వర్షాల కారణంగా కుమరాం గ్రామంలో గోడ కూలి అడ్డాల లక్ష్మి(47), అశోక్ కుమార్ రాజు (5) అనే నానమ్మ, మనవడు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement