Wednesday, April 24, 2024

పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పెద్దపులి సంచరించింది. జిల్లాలోని బాడంగి మండలం అల్లుపాల్తేరులో పులి ఆవుని హతమార్చింది. వరుస పులి ఘటనలతో పలు గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. పులి తిరుగుతోందని అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి తిరుగుతోందని నిర్ధారణకే పరిమితమయ్యారని అటవీ శాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పెద్దపులి గ్రామాల్లోకి వచ్చి ఆవును చంపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement