Thursday, April 25, 2024

రేపటి రాష్ట్ర బంద్ కు టిడిపి మద్దతు.. అచ్చెన్నాయుడు

విజయనగరం : విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మార్చి 5న జరిగే బంద్ కు టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని  అచ్చెన్నాయుడు వెల్లడించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ను టిడిపి శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని ఆయన  పిలుపునిచ్చారు. నాడు ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. నేడు 36 కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ ‌రెడ్డి ఉక్కు కర్మాగారాన్ని త్యాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement