Saturday, April 20, 2024

నగరంలో ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వం

విజయనగరం : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 150 అడుగుల జాతీయ పతాకంతో రాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ పి.నాగేశ్వర రావు, ఈఈ కృష్ణమూర్తి, జిల్లా యూత్ అధికారి విక్రమాదిత్య, జిల్లా నోడల్ అధికారి పి.ఆనంద్ బాబు పాల్గొన్నారు. నగరంలోని మూడు లాంతర్లు కూడలి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement