Wednesday, April 24, 2024

‘గరుడ పురాణాలు’ నమ్మే పరిస్థితి లేదు: చంద్రబాబుపై విజయసాయి సెటైర్

టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చురకలంటించారు. ‘ఓడిన ప్రతిసారీ ప్రజలను నిందించడం పచ్చ బాస్ కే కాదు, విశ్లేషకుల ముసుగులో పచ్చతోలు కప్పుకున్న వారికీ అలవాటే. జనం స్వార్ధపరులని, ఆంధ్రులకు ఆత్మాభిమానం లేదని, ఐక్యమత్యం లేదంటూ నిందించే బదులు ఆత్మ విమర్శ చేసుకోవచ్చుగా? అయినా జనం ‘గరుడ పురాణాలు’ నమ్మే పరిస్థితి లేదులే’ అని పేర్కొన్నారు.

‘’సంస్కారం వలువల్ని గాలికొదిలి నోరు పారేసుకుంటే ప్రజలు హర్షించరు. కర్రుకాల్చి వాతలు పెడతారని మినీ మున్సిపల్ ఎన్నికలతో మరోసారి స్పష్టమైంది. తండ్రీకొడుకులిద్దరూ స్థాయిమర్చి, నీచాతినీచమైన భాషను వాడారు. బూతులు తిట్టడం ప్రజాసేవ కాదని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement