Thursday, April 25, 2024

విశాఖలో ఉపరాష్ట్రపతి.. నలుగు రోజులు ఇక్కడే

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు విశాఖలో జరిగే అనేక కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సతీసమేతంగా విచ్చేసిన ఆయన నగరంలో ఉన్నన్నాళ్లు పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఇదీ చదవండి: టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయండి: జగన్‌కు రఘురామ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement