Thursday, April 25, 2024

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై వర్ల ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ చేయడంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. శాసనసభా గౌరవాన్ని ఈ ప్రభుత్వం దిగజార్చినట్లు గతంలో ఏ ప్రభుత్వం దిగజార్చలేదు అని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేసే దేవాలయం లాంటి శాసనసభను తమ పార్టీ కార్యాలయంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, అసమర్థ‌తను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత‌ల నోళ్లు నొక్కడం, సస్పెండ్ చేయడం దారుణం అని వ‌ర్ల రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement