Wednesday, April 24, 2024

వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్టు తెలిసినా… ప్రభుత్వం స్పందించడం లేదు: వర్ల రామయ్య

సొంత బాబాయ్ హత్యకు కుట్ర జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు టీడీపీ నేత వర్ల్డ్ రామయ్య. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సి.బి.ఐ విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల కిందట వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం రికార్డు చేసిన సంగతి తెలిసిందే. వాచ్ మన్ రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు చెప్పాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. వివేకా హత్యకు ఇద్దరు ప్రముఖులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటని వర్ల ప్రశ్నించారు.

“వివేకా హత్యకేసుకు సంబంధించి ఓ సాక్షి జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. సుపారీ గురించి కీలక సమాచారం అందించాడు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా కదలిక వస్తుందేమోనని రెండ్రోజులు వేచి చూశాను. కనీసం డీజీపీ అయినా ఏమైనా మాట్లాడతాడేమోనని చూస్తే స్పందనేలేదు” అని అన్నారు. సీఎం జగన్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. . ఇది రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వమా? కాదా? అంటూ ధ్వజమెత్తారు. హంతకులను పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదన్నారు.

ఇది కూడా చదవండి: కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ దంపతులు

Advertisement

తాజా వార్తలు

Advertisement