రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, వేద పండితులు పవన్ కళ్యాణ్ కి, మనోహర్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఈసందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇంద్ర కీలాద్రి కొండ దిగువ టోల్గేట్ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యం.. పవన్ కళ్యాణ్

- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement