Friday, March 29, 2024

Breaking: వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కరోనా బారిన పడడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాధాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

కాగా, తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్య ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. రాధా ప్రకటన తర్వాత ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది. 2+2 గన్‌మెన్ల సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. అయితే, సెక్యూరిటీని వంగవీటి రాధా తిరస్కించి, వెనక్కి పంపించి వేశారు.

మరోవైపు రాధా హత్యకు రెక్కీపై పోలీసులు వివరాలు సేకరించారు. అయితే, రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విజయవాడ సీపీ క్రాంతి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement