Monday, April 15, 2024

టీడీపీ నేత పట్టాభిపై వల్లభనేని వంశీ పరువు నష్టం దావా

తెలుగు దేశం పార్టీకి ఆపార్టీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్ బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్ పరువు నష్టం దావా వేశాడు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందంటూ పట్టాభి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనేక సార్లు ప్రెస్‌ మీట్లు, కోర్టుల చుట్టు తిరగారు తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపణలపై రియాక్ట్‌ అయ్యారు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్. పట్టాభి తన ప్రతిష్టకు భంగం కల్గించే వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే వంశీమోహన్ తన అనుచరులతో కలిసి స్థానిక కోర్టులో ఇవాళ పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement