Wednesday, April 24, 2024

FLASH: విజయనగరంలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి హత్య

విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుమిలి రోడ్ లోని దయాల్ నగర్ ..బేతన పల్లి మధ్యలో ఓ యువతి మృతదేహం శనివారం లభ్యమైంది. ఆమె వయస్సు సుమారు 25 ఏళ్ళు ఉంటుంది. దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పంపించడంతో ఆమె శరీరం మొత్తం కాలిపోయింది. శనివారం అటుగా వెళుతున్న కొంతమంది చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఏ ప్రాంతానికి చెందిన వారో వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఆమెపై అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎక్కడో హత్య చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వచ్చి పెట్రోలు పోసి నిప్పంటించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement