Thursday, April 25, 2024

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తలకు గాయం.. ఏం జరిగిందంటే..

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్‌ తగలడంతో గాయం తగిలింది. విజయవాడలో గురువారం జరిగిన జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రథమ చికిత్స తీసుకుని తెలంగాణకు బయల్దేరినట్లు తెలుస్తోంది. అంతకుముందు కిషన్‌ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా,  తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement