Tuesday, April 23, 2024

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ఇవ్వాల (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆయనకు స్వాగ‌తంప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, డైరీ, క్యాలెండర్ అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబర్​ భానుప్ర‌కాష్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement