Thursday, April 25, 2024

Krishna river – ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా

తాడేపల్లి,మే26(ప్రభ న్యూస్) ఎంటిఎంసి పరిధిలోని తాడేపల్లి సీతానగరం రైలు బ్రిడ్జ్ క్రింద ఈత సరదా ఇద్దరు ప్రాణాలు బలిగొన్నది. .ఈత సరదాతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వేసవికాలంలో కావడంతో ఈత సరదాతో కృష్ణా నదిలో మునిగి మృతి చెందుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో వరుసగా కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు యువకులు శుక్రవారం మృతి చెందటం బాధాకరం.

మంగళగిరి తాడేపల్లి నగర పాలక పరిధిలోని డోలస్ నగర్ కి చెందిన ఆరుగురు యువకులు శుక్రవారం సీతానగరం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి సమీపంలో కృష్ణానదిలో సరదాగా ఈత వేయటానికి దిగారు ప్రమాదవశాత్తు డేరంగుల కృష్ణయ్య,డేరంగుల శంకర్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.
మృతదేహాలను స్థానిక మత్స్యకారుల సహాయంతో వెలికి తీసి మార్చురీకి తరలించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేసవికాలంలో సరదా కోసం కృష్ణానదిలో ఈతకు వచ్చి మృత్యువాత పడుతున్న యువకులను కట్టడి చేసేందుకు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement