Thursday, April 25, 2024

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

వెంకటాచలం, (ప్రభన్యూస్) : ఈత కోసం వెళ్లి ఇరువురు యువకులు మృత్యువాత పడిన సంఘటన కందల పాడు సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. కనుపూరు గ్రామానికి చెందిన సాయి సిద్ధార్థ తిరుపతి నివాసి తన మిత్రుడు అయిన పర్నా అనుదీప్, ప్రశాంత్ మరో ముగ్గురు కలిసి కందలపాడు సమీపంలోని కనుపూరు కాలువ వద్దకు గురువారం సాయంత్రం ఈత కోసం వెళ్లారు. ముగ్గురు కాలువలో దిగిన వెంటనే నీటి వేగానికి కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న ముగ్గురు యువకులు ప్రశాంత్ ను కాపాడారు. కానీ సాయి సిద్ధార్థ అనుదీప్ ఇరువురు నీటి వేగానికి కొట్టుకు పోయి మృతి చెందారు. యువకుల కేకలు విన్న సమీప పొలంలోని రైతులు హుటాహుటిన వద్దకు వచ్చి మృతిచెందిన సాయి సిద్ధార్థ-21,అనుదీప్-24 మృతదేహాలను వెలికి తీశారు.

కాగా కనుపూరు గ్రామానికి చెందిన సాయి సిద్ధార్థ గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తిరుపతికి చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నూతన సంవత్సరం ముందు రోజు ఈ సంఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటాచలం పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement